వేసవి సెలవులు: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కంపార్ట్‌మెంట్లు ఫుల్

  • బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 89,403 మంది భక్తులు
  • హుండీ ద్వారా రూ. 4.99 కోట్ల ఆదాయం
  • సర్వదర్శనానికి 12 గంటల సమయం
  • కంపార్ట్‌మెంట్లు నిండి క్యూ లైన్లు బయటకు
  • తలనీలాలు సమర్పించిన 49,958 మంది భక్తులు 
తిరుమల శ్రీవారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తడంతో రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 89,403 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా నమోదైంది. ఒక్కరోజే రూ.4.99 కోట్లు కానుకల రూపంలో వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.

వివిధ విభాగాల వారీగా టీటీడీ విడుదల చేసిన వివరాల ప్రకారం, బుధవారం 49,958 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదేవిధంగా, 4.22 లక్షల శ్రీవారి లడ్డూలను విక్రయించారు. తిరుమలకు వచ్చే భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాన్ని 2.52 లక్షల మంది స్వీకరించగా, 3,603 మందికి వైద్య సేవలు అందించారు.

భక్తుల రద్దీ కారణంగా సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయం గణనీయంగా ఉంది. టోకెన్లు లేని సర్వదర్శనం కోసం కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లు బయట కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు విస్తరించాయి. సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
 

Tirumala
Tirumala Temple
TTD
Summer Holidays
Lord Venkateswara
Devotees
Rush
Srivari Hundi
Krishna Teja Guest House

More Telugu News